హర్యానాలోని గుర్గావ్ సెక్టార్-10 టెక్చంద్ నగర్లో పేలుడు సంభవించింది. ఓ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనం అయ్యారు. అర్ధరాత్రి బాయిలర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీ సమీపంలోని ఇతర ఫ్యాక్టరీలు, భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఎస్డిఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి.