ఆన్లైన్ గేమ్స్.. ఇన్నాళ్లు ఇష్టారాజ్యం.. లక్షల కోట్ల లావాదేవీలు.. రీసెంట్గా జీఎస్టీ పరిధిలోకి వచ్చింది.. 28 శాతం పన్ను విధింపు కిందకు వచ్చింది. కొత్తగా వచ్చిన ఈ రూల్తో చిన్నా చితక కంపెనీలు మూతపడ్డాయి.. బడా కంపెనీలు మాత్రం ఆఫర్స్, విన్నింగ్ మనీ తగ్గించేశాయి. తాజాగా ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ నోటీసులు ఇచ్చింది. ఈ విషయంలోనే గేమింగ్ కంపెనీలకు, ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొంది.