పదమూడేళ్ల క్రితం రైల్ రోకో సందర్భంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. ఇవాళ విచారణ జరగనుంది. 2011లో రైల్ రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు పెట్టారని పిటిషన్ లో పేర్కొన్నారు. తనను 15వ నిందితుడిగా చేర్చారని, తాను రైల్ రోకోలో పాల్గొనలేదని తెలిపారు. ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని పిటిషన్లో కోరారు.