మానసిక ప్రశాంతత కోసం సౌత్ సూపర్స్టార్ రజనీకాంత్ ఏటా హిమాలయాలను దర్శిస్తుంటారు. అక్కడి సుందరమైన ప్రకృతిలో కొద్ది రోజులు గడుపుతారు. ఇక తాజాగా మరోసారి హిమాలయాల బాటపట్టారు ఈ సౌత్ సూపర్ స్టార్. యాత్రలో భాగంగా చెన్నై నుంచి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్లో తన ఆధ్యాత్మిక యాత్ర గురించి మాట్లాడారు. ప్రపంచమంతటా ఆధ్యాత్మికత భావం అవసరమని సూపర్ స్టార్ అన్నారు.