సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచే భవన నిర్మాణాన్ని కూల్చేసి కొత్త భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నందున వీలైనంత త్వరగా నూతన భవనాన్ని నిర్మించేందుకు కృషిచేస్తున్నట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. అన్ని రకాల చర్యలు చేపట్టిన తర్వాతే పాతభవనాలను కూల్చివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.