పత్తి కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 2024-25 పత్తి కొనుగోళ్లలో తెలంగాణ అత్యధికంగా పత్తి కొనుగోళ్లను నమోదు చేసి టాప్లో నిలిచిందని కేంద్ర టెక్స్టైల్స్ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (30 లక్షలు), గుజరాత్ (14 లక్షలు) ఉన్నాయని వెల్లడించింది. కాగా, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగైందని అధికారులు తెలిపారు.