టెస్ట్ క్రికెట్లో ఒకరోజు అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా భారత్ నిలిచింది. సౌతాఫ్రికాతో టెస్టులో మహిళల జట్టు ఆట ముగిసే సమయానికి 525/4 రన్స్ చేసింది. పురుషులు, మహిళల టెస్ట్ క్రికెట్లో ఒకరోజులో ఇదే అత్యధిక స్కోర్. 2002లో బంగ్లాపై లంక 509/9 రన్స్ చేసింది. భారత్ ఇన్నింగ్స్లో షెఫాలీ 205, స్మృతి మందాన 149 రన్స్తో చెలరేగారు. జెమీమా 55 చేసి ఔటవ్వగా.. ప్రస్తుతం క్రీజులో హర్మన్ 42*, రిచా 43* ఉన్నారు.