స్పీకర్ ఎంపికపై తాము అన్ని రాజకీయ పార్టీల సభాపక్ష నేతలతో సంపద్రింపులు జరిపామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్సభ స్పీకర్ పదవి సభా నిర్వహణకు సంబంధించిన అంశమని మంత్రి పేర్కొన్నారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం ఆనవాయితీ అని, దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ స్పీకర్ పదవికి తమ అభ్యర్ధిని బరిలో నిలిపిందని చెప్పారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను ఇలా ఇచ్చిపుచ్చుకోవడం సరైంది కాదన్నారు.