జూన్ 4న కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి అధికారం చేపడుతుందని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయేకు భంగపాటు తప్పదని పేర్కొన్నారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. జూన్ 4 తర్వాత ఢిల్లీ పోలీసులు ప్రజల మాటకు తలవంచక తప్పదని స్పష్టం చేశారు.