చెన్నై స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా ‘అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’గా అవుటయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో ‘ఫీల్డర్ను అడ్డుకోవడం’ కారణంగా ఔటైన మూడో ఆటగాడిగా జడేజా నిలిచాడు. రాజస్థాన్తో నిన్న జరిగిన మ్యాచ్లో జడ్డూను రనౌట్ చేసేందుకు సంజూ శాంసన్ బంతిని స్టంప్పైకి విసిరాడు. అయితే జడేజా స్టంప్కు అడ్డుగా రావడంతో థర్డ్ అంపైర్ జడేజాను అవుట్గా ప్రకటించారు. కాగా గతంతో యూసుఫ్ పఠాన్, అమిత్ మిశ్రాలు ఇదే విధానంలో ఔటయ్యారు.