తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ నేఫథ్యంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటు వేయడానికి వచ్చిన ఓటరుపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సోదరుడు నగేష్ షెట్కార్ దాడికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే ఓటరును కాలితో తన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగేష్పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.