ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించిన సలహాదారు పోచారం

బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళల శక్తి క్యాంటీన్ ను గురువారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్