సీఎం రేవంత్ రెడ్డిని గురువారం ఎలారెడ్డి అసెంబ్లీ ఎమ్యెల్యే కె. మదన్ మోహన్ రావు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా పుష్పగుచ్ఛం అందచేసి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో ఎల్లారెడ్డి సెగ్మెంట్ అభివృద్ధికి ఇప్పటి వరకు మంజూరు చేసిన నిధులు, జరుగుతున్న అభివృద్ధికి ఎల్లారెడ్డి ప్రజల తరఫున సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సెగ్మెంట్ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు కోరారు.