కాంగ్రెస్కు ఓటు వేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్లే బండి సంజయ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 'ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్ చెప్పాలి. కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారు. మోదీ తనను అరెస్టు చేయాలని చూస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడింది. ఇక్కడి డబ్బులు విదేశాల్లో, ఢిల్లీ మద్యంలో పెట్టుబడులు పెడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి చేయకపోతే సీబీఐకి లేఖ రాయాలి' అని అన్నారు.