నిజామాబాద్ నగరంలో సోమవారం భారీ చోరీ జరిగింది. తిలక్ గార్డెన్ మున్సిపల్ కాంప్లెక్స్లోని శ్రీ వెంకటేశ్వర మొబైల్స్ షాప్లో 4 లక్షల నగదు, 20 స్మార్ట్ ఫోన్లు ఎత్తుకెళ్లినట్టు యజమాని తెలిపారు. ఈ మేరకు షాప్ గోడ వెనుక భాగానికి రంధ్రం చేసి అందులో నుంచి చిన్న పిల్లలను పంపించి చోరీ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సమీపంలో ఈ చోరీ జరగడం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.