ఐపీఎల్ 2024 ట్రోఫీని కోల్కతా నైట్రైడర్స్ గెలుచుకోవడంలో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ది కీలక పాత్ర అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ తరుణంలో గంభీర్ ఎక్స్ లో 'ఎవరి ఆలోచనలు, చర్యలు సత్యంపై ఆధారపడి ఉంటాయో వారికి ఇప్పటికీ శ్రీకృష్ణుడే రథసారథి' అని పోస్ట్ చేశాడు. గంభీర్ పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. దీని వెనక ఆయన ఉద్దేశం ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది.