సీఎం రేవంత్రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవత్ ఆహ్వానించనున్నారు. అలాగే ఈ వేడుకలకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రం నుంచి పలువురు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లవచ్చని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.