తెలంగాణలోని ములుగు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వాజేడు మండలం కొంగాలగుట్టపై మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఒకరు మృతి చెందారు. ఇవాళ ఉదయం కట్టెల కోసం అడవికి ముగ్గురు వ్యక్తులు వెళ్లగా వారిలో ఏసు అనే వ్యక్తి మందుపాతర తొక్కడంతో అది పేలింది. మరో ఇద్దరు రమేష్, ఫకీర్లకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు జగన్నాధపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.