ఏపీ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ గుడ్ న్యూస్ అందించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే కూటమిని ఉద్దేశించి గుడ్ న్యూస్ పోస్ట్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్డీయేకు ఒక అసాధారణమైన తీర్పును ఇచ్చింది! రాష్ట్ర ప్రజల ఆశీస్సులకు ధన్యవాదాలు. ఈ ఘన విజయం కోసం కష్టపడిన చంద్రబాబు, పవన్, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలను నేను అభినందిస్తున్నాను. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాం, రాబోయే కాలంలో రాష్ట్రం అభివృద్ధి చెందేలా చూస్తామంటూ ఆయన తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు.