కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన తరుపున గెలిచిన పంతం నానాజీ భారీ మెజార్టీ సాధించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధిక మెజార్టీ 72,040 ఓట్లు ఆయనకు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన పవన్ కళ్యాణ్ మెజార్టీ 70,279ను దాటేశారు. పార్టీ అధ్యక్షుడిని మించి ఆయన అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఇక ఉమ్మడి జిల్లాలో 19 నియోజకవర్గాల్లోనూ టీడీపీ (13), జనసేన (5), బీజేపీ (1) క్లీన్ స్వీప్ చేశాయి.