ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మరోసారి తీరని దెబ్బ తగిలింది. ముచ్చటగా మూడోసారి ఏపీలో ఏ ఒక్క స్థానంలో గెలువలేక పోయింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలుండగా కాంగ్రెస్ వందకు పైగా స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఏ ఒక్క స్థానంలో విజయం సాధించలేకపోయింది. కడప ఎంపీ స్థానానికి పోటీ చేసి వైఎస్ షర్మిల సైతం ఓటమి పాలైంది. 2014, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క సీటును దక్కించుకోలేక పోయింది.