ఏపీలోని అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ పూర్తైనా ఫలితం తేలలేదు. ఇక్కడ 11,45,426 ఓట్లు పోలైనట్లు గతంలో ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే తాజాగా 11,37,917 ఓట్లను మాత్రమే లెక్కించారు. దీంతో 7509 ఓట్లు గల్లంతు అయినట్లు తేలింది. బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆర్వోను కోరారు. దీంతో ఇక్కడ ఫలితం ఇంకా ప్రకటించలేదు.