ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటూ గెలవలేదు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 175 స్థానాలకు గానూ 164 స్థానాల్లో విజయం సాధించింది.