మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మరోసారి భారత్పై విషం చిమ్మారు. ముగ్గురు మంత్రులను పార్లమెంటు తొలగించడాన్ని ప్రస్తావిస్తూ.. మాల్దీవుల వెలుపల ఉన్న సమూహాల నుంచి వారిపై ప్రభావం ఉన్నందున అలా చేయవలసి వచ్చిందన్నారు. ఆయన నిర్ధిష్ట దేశం పేరు చెప్పనప్పటికీ, ముయిజ్జు అధికారం చేపట్టినప్పటి నుంచి భారత్లో మాల్దీవుల సంబంధాలు క్షీణించాయి. ప్రతిపక్షాలు భారత్తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నాయని ప్రభుత్వం కూడా విశ్వసిస్తోంది.