HYD: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు దాటినా ఇప్పటివరకు ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం సిగ్గుచేటని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓల్డుబోయినపల్లిలోని బోయిన్చెరువు, నాలా, డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన నాలా పనులను అధికారులు పూర్తి చేయలేదని, డ్రైనేజీ నీరు రోడ్లపై పారుతున్నా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే మండిపడ్డారు.