మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు బెయిల్

64చూసినవారు
మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు బెయిల్
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. గతేడాది చెన్నైలోని ఓ సదస్సులో ఆయన సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాతో పోల్చారు. ఈ క్రమంలో బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టులో సామాజిక కార్యకర్త పరమేష్ ఆయనపై కేసు వేశారు. మంత్రి హాజరై కోర్టుకు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. కేసు విచారణను ఆగస్టు 8కి కోర్టు వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్