కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్లో ఇద్దరు టూరిస్ట్లను ఓ ఏనుగు వెంబడించింది. దీంతో వారు ప్రాణ భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అందులోనూ ఒకరైతే తృటిలో తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.