లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా రెండోసారి ఎన్నికయ్యారు. మూజువాణి ఓటుతో ఆయన గెలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ బుధవారం ప్రకటించారు. అనంతరం ఓం బిర్లాను స్పీకర్ ఛైర్ వద్దకు ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీసుకెళ్లారు. ఆయనకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థాన్లోని కోటా నియోజకవర్గం నుంచి ఓం బిర్లా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.