ప్రధాని నరేంద్ర మోదీ పదవి నుంచి దిగిపోనున్నారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మోదీని సాగనంపేందుకు ప్రజలు సంసిద్ధమయ్యారని అన్నారు. ఆయనకు మరోసారి ప్రజా తీర్పు అనుకూలంగా రాదని స్పష్టం చేశారు. తొలి రెండు దశల పోలింగ్ అనంతరం బీజేపీ దక్షిణాదిలో సాఫ్ అవుతోందని, ఉత్తరాది, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో సగానికి పరిమితమవుతుందని జోస్యం చెప్పారు.