లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయించారని మహబూబ్నగర్ లోక్సభ BJP అభ్యర్థి డీకే అరుణ అన్నారు. పోలింగ్ కేంద్రాలకు ఉ.7 గంటలకు ముందే కుటుంబాలతో కలిసి చేరుకున్నారని చెప్పారు. సీఎం రేవంత్ 8 సార్లు జిల్లాకు వచ్చి ప్రచారం చేసినా ప్రజలంతా బీజేపీ వైపే నిలిచారన్నారు. మహబూబ్నగర్లో 2 -3 లక్షల మెజారిటీతో విజయం సాధిస్తున్నామని.. రాష్ట్రవ్యాప్తంగా 12 స్థానాల్లో విజయం సాధించబోతోందన్నారు.