ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుతో సమావేశమయ్యారు. మంగళవారం ఢిల్లీలోని త్యాగరాజ్ మార్గ్లోని వెంకయ్య నాయుడు నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ జాతీయ ప్రయోజనాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. వీరిద్దరి భేటీపై మోడీ ట్వీట్ చేశారు. తాను వెంకయ్య నాయుడును కలిశానని, ఆయనతో దశాబ్దాలుగా పని చేసే అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు. భారతదేశ పురోగతి పట్ల ఆయన వివేకం, అభిరుచిని ఎప్పుడూ ప్రశంసించానని అన్నారు.