లోక్సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో కన్యాకుమారిలో ప్రధాని మోదీ 45 గంటల పాటు ఏకాంత ధ్యానముద్రలోకి వెళ్లిన విషయం తెలిసిందే. 45 గంటల పాటు ఆయన చేపట్టిన ధ్యానం ఇవాళ ముగిసింది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో ఆయన ధ్యానం చేశారు. గురువారం సాయంత్రం 6.45 నిమిషాలకు ప్రధాని మోదీ ధ్యానంలో కూర్చున్నారు. 45 గంటల పాటు మోదీ మౌనంగానే ఉన్నారు.