లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ, ప్రియాంక పిల్లలు రైహాన్ రాజీవ్ వాద్రా, మిరయా వాద్రా, ఢిల్లీ మంత్రులు అతిశీ, సౌరభ్ భరద్వాజ్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.