ఒక్కప్పుడు అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన శోభన తెలుగులో చివరిసారి 2006లో వచ్చిన ‘గేమ్’ మూవీలో కనిపించారు. మళ్లీ 18 ఏళ్ల తర్వాత ‘కల్కి 2898 ఏడీ’ తో టాలీవుడ్కు రీ ఎంట్రీ ఇవ్వనుండడం విశేషం. ‘కల్కి’ చిత్రంలో ప్రభాస్ భైరవగా, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటించారు. సీనియర్ హీరో కమల్హాసన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.