ప్రపంచ స్కేటింగ్ పోటీల్లో తెలుగు తేజం జెస్సీరాజ్(13) సత్తా చాటి పసిడి పతకంతో మెరిసింది. జెస్సీరాజ్ అంతర్జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడంపై మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. విజయవాడకు చెందిన బాలిక ప్రపంచస్థాయిలో భారత్ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేయడం గర్వంగా ఉందన్నారు. ప్రతిభ గల క్రీడాకారిణులకు తమ ప్రభుత్వం అన్నివిధాలా సహాయ, సహకారాలను అందించి ప్రోత్సహిస్తుందని తెలిపారు.