సికింద్రాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో అతివేగంతో వస్తున్న లారీ.. ఓ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.