లోక్సభ ఎన్నికల్లో భాగంగా గోవా నుంచి తొలిసారిగా బీజేపీ ఓ మహిళకు టికెట్ ఇచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, డెంపో ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పల్లవి డెంపో(49)ను సౌత్ గోవా నుంచి బరిలోకి దిపింది. దీంతో రాష్ట్రంలో బీజేపీ టికెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న మొదటి మహిళగా డెంపో నిలిచారు. కాగా సౌత్ గోవాలో 1962 నుంచి ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే బీజేపీ గెలిచింది.