ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తాం

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో ప్రమాదవశాత్తు కాలిపోయిన సుమారు 100 ఈత చెట్ల ప్రాంతాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ బుధవారం పరిశీలించారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి గీత కార్మిక సోదరులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కార్యకర్తలు, గౌడ సంఘం సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్