మంథని మండలం నాగెపల్లి గ్రామపంచాయతీ నర్సరీ, తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్, స్మశాన వాటికలను బుధవారం జిల్లా పంచాయతీ అధికారి ఆశా లత ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ ప్రజలకు అధికారులకు తగు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో మంథని మండల పరిషత్ అధికారి అరిఫ్ హుస్సేన్, పంచాయతీ కార్యదర్శి జుహీబ్ పాల్గొన్నారు.