టీ20 ప్రపంచకప్-2024 లీగ్ మ్యాచ్లో నేపాల్ జట్టుపై సౌతాఫ్రికా ఒక్క పరుగు తేడాతో గెలుపోందింది. శనివారం ఉదయం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన నేపాల్ తొలుత బౌలింగ్ చేసింది. స్పిన్నర్ కుశాల్ భూర్తేల్(4/19), పేసర్ దీపేంద్ర సింగ్(3/21) దెబ్బకు సౌతాఫ్రికా నిర్ణిత 20 ఓవర్లలో 115 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్(43), ట్రిస్టన్ స్టబ్స్(18 బంతుల్లో 27 నాటౌట్) మాత్రమే రాణించారు.