టీ20 ప్రపంచ కప్ గ్రూప్ స్టేజ్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ఇక కీలకమైన రెండో దశకు తెరలేవనుంది. నేటితో లీగ్ స్టేజ్ ముగిసి.. బుధవారం నుంచి సూపర్-8 పోరు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆ ఎనిమిది జట్లేవో తెలిసిపోయింది. ఇవి కూడా రెండు గ్రూప్లుగా విడిపోయి తలపడతాయి. గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ చోటు సంపాదించాయి. ఇక గ్రూప్-2లో యూఎస్ఏ, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, యూఎస్ఏ తలపడతాయి.