లోయలో పడ్డ బస్సు.. 10 మంది స్పాట్ డెడ్ (వీడియో)

జమ్మూ కశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మూ-పూంచ్ జాతీయ రహదారి (144A)పై అఖ్నూర్‌లోని తుంగి మోర్ ప్రాంతంలో 150 అడుగుల ఎత్తు నుంచి బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 10 మంది మృతి చెందగా, 40 మంది తీవ్ర గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్