కేజ్రీవాల్ పిటిషన్లపై విచారణ వాయిదా

81చూసినవారు
కేజ్రీవాల్ పిటిషన్లపై విచారణ వాయిదా
ఢిల్లీ మద్యం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. జూన్ 1 మధ్యాహ్నం 2 గంటలకు కేజ్రీవాల్ సాధారణ, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై విచారణ జరపనుంది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థ ఈడీని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్