దేశంలోని టెక్ ఉద్యోగాల్లో లింగ అసమానత కనిపిస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్ ఈశా అంబానీ బుధవారం వెల్లడించారు. మహిళలు ఉపాధ్యాయులుగా బాగా సరిపోతారనే మూస సిద్ధాంతాలు ఇంకా ఈ సమాజంలో ఉన్నాయన్నారు. టెక్ ఉద్యోగాల్లో తక్కువ శాతం మంది మహిళలు ఉండటానికి నైపుణ్యాల లేమి కూడా ఒక కారణమని తెలిపారు. టెక్ ఉద్యోగాల్లో 36% మంది మహిళలే ఉన్నారని ఈశా పేర్కొన్నారు.