మద్యం మత్తులో ఉన్న కొడుకుని తల్లీ, అతని సోదరుడే హత్య చేశారు. ఉప్పల్ రామంతాపూర్ కామాక్షిపురంకు చెందిన కోరె శోభకు మురళి (23), మనోహర్(20) కుమారులు ఉన్నారు. శోభ భర్త కుమార్ బ్రెయిన్ ట్యూమర్తో ఈనెల 8న మృతి చెందాడు. కాగా శుక్రవారం మురళి స్నేహితులతో కలిసి మద్యం తాగి అర్థరాత్రి వీధుల్లో తిరుగుతూ హంగామా చేయడంతో శోభ, మనోహర్ మురళిని చీరతో కాళ్లు, చేతులు కట్టేశారు. అయినప్పటికీ అరుస్తూనే ఉండటంతో చీరను గొంతుకు బిగించగా ప్రాణాలు వదిలాడు.