మహిళల ఆశీర్వాదం ఉన్నందువల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. HYDలోని పరేడ్ గ్రౌండ్స్లో ‘మహాలక్ష్మి స్వశక్తి మహిళా’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా 100 మార్కెట్లు, వారి ఉత్పత్తుల విక్రయం కోసం ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయిస్తామన్నారు. తెలంగాణలోని కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.