నేడు సునీల్ ఛెత్రి ఆఖరి మ్యాచ్

భారత స్టార్ ఫుట్బాలర్ సునీల్ ఛెత్రి నేడు తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నారు. కోల్కతాలో కువైట్తో జరగనున్న ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్లో ఆడి వీడ్కోలు పలకనున్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ ప్రపంచకప్ మూడో రౌండ్కు అర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో ఆఖరి మ్యాచ్ లో ఛెత్రి ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఛెత్రి శకం నేటితో ముగియనుంది. ఈ మ్యాచ్ రాత్రి గం.7కు ప్రారంభమవుతుంది.

సంబంధిత పోస్ట్