టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. ప్రత్యర్థి ఐర్లాండ్ జట్టుకు చెందిన ఆరుగురు బ్యాటర్లను ఔట్ చేశారు. దీంతో 9.4 ఓవర్లలోనే 44 పరుగులకు 6 వికెట్లను ఐర్లాండ్ కోల్పోయింది. భారత బౌలర్లలో అర్షదీప్ 2, హార్దిక్ పాండ్య 2, బుమ్రా, సిరాజ్ ఒక్కోటి చొప్పున వికెట్లు తీశారు.