విషాదం.. కరెంట్ షాక్‌తో భార్యభర్తలు మృతి

దండెంపై ఆరేసిన బట్టలు తీస్తుండగా కరెంట్ షాక్ దంపతులు మృతి చెందారు. ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని హనుమాన్ బజార్ లో పల్లపు ఆంజనేయులు, నర్సమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఇనుప దండెంపై ఉన్న టవల్‌ను తీసే ప్రయత్నంలో నర్సమ్మ కరెంట్ షాక్ కు గురైంది. గమనించిన భర్త ఆంజనేయులు ఆమెను తప్పించబోయాడు. ఈ క్రమంలో ఆయనకు కూడా విద్యుత్ షాక్ తగలడంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.

సంబంధిత పోస్ట్