కాశ్మీర్లో ఉన్న అమర్నాథ్ ఏడాదికి రెండుసార్లు మాత్రమే భక్తుల దర్శనార్థం తెరవబడుతుంది. ఈ సమయంలోనే భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యాత్రికులు అమర్నాథ్ శివలింగ దర్శనానికి వస్తుంటారు. అయితే ఈ ఏడాది జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఆగస్ట్ 19 వరకు కొనసాగుతుంది. మంచుతో కప్పబడిన శివలింగ గుహను సందర్శించడానికి లక్షలాది మంది భక్తులు అమర్నాథ్కు తరలిరానున్నారు.